బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్ విలన్ గా నారా రోహిత్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భైరవం'(Bhairavam). ‘నాంది’ ‘ఉగ్రం’ వంటి చిత్రాలను అందించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకి దర్శకుడు.
2025 మే 30న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోపక్క ‘ఖలేజా’ రీ- రిలీజ్ వల్ల కూడా ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి. అయితే మాస్ సెంటర్స్ లో ఈ సినిమా కొంత హోల్డ్ చేసి డీసెంట్ షేర్స్ ని రాబట్టింది.కానీ గట్టెక్కే రేంజ్లో అయితే కాదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ గమనిస్తే :
| నైజాం | 3.14 cr |
| సీడెడ్ | 0.99 cr |
| ఆంధ్ర(టోటల్) | 3.26 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 7.39 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.44 cr |
| ఓవర్సీస్ | 0.59 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 8.42 cr |
‘భైరవం’ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.8.42 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.14.10 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.7.08 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.