ఓ పక్క రీమేక్ చేస్తున్నాడు.. మరోపక్క రీమేక్ ఇస్తున్నాడు..!

  • March 23, 2020 / 11:11 PM IST

వరుసగా మూడు ప్లాప్ లు ఫేస్ చేస్తున్న టైములో ‘భీష్మ’ చిత్రంతో హిట్ అందుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కరోనా ఎఫెక్ట్ కనుక లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లోకి రీమేక్ చేయబోతున్నారట.

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రం రైట్స్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. రన్బీర్ కపూర్, వరుణ్ దావన్, టైగర్ ష్రాఫ్ వంటి యంగ్ హీరోలలో ఒకరితో ఈ రీమేక్ ను రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఈ మధ్య మన సినిమాలకు అక్కడ ఆదరణ ఎక్కువవడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక మరో పక్క నితిన్.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus