Evaru Meelo Koteeswarulu: ప్రేక్షకుల మనసుల్ని తారక్ గెలుచుకుంటారా?

  • August 19, 2021 / 07:08 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఈ నెల 22వ తేదీ నుంచి బుల్లితెరపై జెమినీ ఛానల్ లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు కానుండగా జెమినీ ఛానల్ నిర్వాహకులు ఈ షోకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో పాటు వాల్ పోస్టర్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ షోపై అంచనాలను అమాంతం పెంచుతున్నారు.

ఇప్పటికే రిలీజైన ప్రోమోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఇప్పటికే బిగ్ బాస్ షోతో సత్తా చాటిన ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1కు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించారు. సినిమా రేంజ్ లో ఈ షోకు ఛానెల్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేస్తుండటంతో ఈ షోకు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు వచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మనీతో పాటు మనసుల్ని గెలుచుకుంటారంటూ ప్రోమోల్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఎన్టీఆర్ ఈ షోతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటారో లేదో చూడాల్సి ఉంది. జెమినీ ఛానల్ నిర్వాహకులు ఈ షోపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. సామాన్యుల కలలను నిజం చేసే షో కావడంతో ఈ షో రేటింగ్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus