Pallavi Prashanth: అక్షయ తృతీయ రోజున ప్రశాంత్ కు లక్ కలిసొచ్చిందా.. అసలేమైందంటే?

  • May 10, 2024 / 10:32 PM IST

బిగ్ బాస్ సీజన్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) పేరు బిగ్ బాస్ షో ప్రసారమైన సమయంలో మారుమ్రోగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలవడంతో ప్రశాంత్ కు రెమ్యునరేషన్ తో పాటు, ఫ్రైజ్ మనీ, 15 లక్షల రూపాయల విలువైన జ్యూవెలరీ బహుమతిగా లభించాయి. అయితే ఆ 15 లక్షల రూపాయల విలువైన నగలను అక్షయ తృతీయ రోజున ప్రశాంత్ కు బహుమతిగా ఇవ్వడం జరిగింది.

తనకు జ్యువెలరీ బహుమతిగా ఇచ్చిన ఫోటోలను పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఖరీదైన జ్యూవెలరీని తన తల్లికి ఇవ్వనున్నట్టు పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ లాంటి కొడుకును కన్న తల్లీదండ్రులు నిజంగా అదృష్టవంతులు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ కు సరిగ్గా అక్షయ తృతీయ రోజున అదృష్టం కలిసొచ్చిందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ సరైన గైడెన్స్ తో అడుగులు వేస్తే మాత్రం కెరీర్ పరంగా అతనికి తిరుగుండదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ తన గురించి తాను అతిగా మాత్రం ఊహించుకోవద్దని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ కు క్రేజ్ బాగానే ఉందని అయితే ఆ క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ రాబోయే రోజుల్లో సినిమాలపై ఫోకస్ పెడతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ షో వల్ల టీవీ షోలలో కూడా ఆఫర్లు అయితే వస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ మాత్రం మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లానింగ్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus