బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఈసారి ఎంత వసూళ్లు చూస్తామో?

  • October 20, 2024 / 07:26 AM IST

బాలీవుడ్‌ పని అయిపోయింది అని గట్టిగా మాటలు వినిపించేటప్పుడల్లా ఓ సినిమా (Movie) వచ్చి వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. ‘మేం బాలీవుడ్‌.. ఇక్కడ తగ్గేదిలే’ అని చూపిస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఇలా చేసి చూపించిన చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2) . శ్రద్ధ కపూర్‌ (Shraddha Kapoor) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో మూడో ‘స్త్రీ’కి టీమ్ రెడీ అవుతోంది.

Movie

శ్రద్ధ కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావు (Rajkummar Rao) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా సుమారు రూ.900 కోట్ల వసూళ్లు అందుకుంది. పక్కాగా లెక్క చెప్పాలంటే నిన్నటికి రూ.873 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే సినిమా ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి వసూళ్లు రౌండ్‌ ఫిగర్‌కు రావొచ్చు. అందుకే సినిమా టీమ్‌ ‘స్త్రీ 3’  పనులను స్టార్ట్‌ చేసేసిందట. ‘స్త్రీ’ సినిమా కథ వినగానే ఆశ్చర్యపోయానని చెప్పిన శ్రద్ధ కపూర్‌..

సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదే అనిపించిందని చెప్పింది. అందుకే సీక్వెల్‌ కోసం కాంటాక్ట్‌ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేశాను అని తెలిపింది. అనుకున్నట్లుగా మొదటి పార్ట్‌కి మించిన రెస్పాన్స్‌ ‘స్త్రీ2’ సినిమాకు వచ్చిందని ఆనందంగా చెప్పింది శ్రద్ధ. ఇప్పుడు మూడో పార్ట్‌లో దీనికి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని తెలిపింది. మూడో పార్ట్‌ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, అందులో చాలా మార్పులు చేస్తున్నట్లు శ్రద్ధ కపూర్‌ తెలిపింది.

ఇక 2018లో ‘స్త్రీ’ సినిమా వచ్చింది. దానికి సీక్వెల్‌గా ‘స్త్రీ 2’ ఈ ఏడాది వచ్చింది. చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకునేలోగా ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు అనేది ‘స్త్రీ 2’ కథ. మరిప్పుడు మూడో పార్టులో ఏం చూపిస్తారో?

సంక్రాంతి థియేటర్స్.. ఒక్కరికి తప్పితే అందరికి తక్కువే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus