టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోయిన్లు కలిసిరావట్లేదా.. ఏం జరిగిందంటే?

  • November 23, 2023 / 10:52 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బ్యూటీలతో కలిసి నటించడానికి ఇష్టపడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే చాలామంది బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ హీరోలకు షాకిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి నటించిన మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ప్రభాస్ సుజిత్ కాంబోలో తెరకెక్కిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. మేజర్ సినిమాతో సక్సెస్ అందుకున్న సయీ మంజ్రేకర్ గని, స్కంద సినిమాలతో రెండు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు. గని, స్కంద సినిమాలలో సయీ మంజ్రేకర్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. రంగబలి సినిమాలో నాగశౌర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ యుక్తీ తరేజా నటించగా ఈ సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా (Ananya Panday) అనన్య పాండే నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ డిజాస్టర్లు అనే ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరుకుతుంది. సాక్షి వైద్య నటనకు నెగిటివ్ మార్కులు పడగా ఈ బ్యూటీ కూడా బాలీవుడ్ బ్యూటీ అనే సంగతి తెలిసిందే.

దేవరలో జాన్వీ కపూర్, గూఢచారి2 సినిమాలో బనిత సంధు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హీరోయిన్లు అయినా సక్సెస్ లను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్స్ గా పేరు సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మారాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus