ఎన్టీఆర్, బాబీ సినిమాకి విలన్ దొరికాడు

  • February 7, 2017 / 12:59 PM IST

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ సెట్స్ పైకి వెళ్లే రోజు దగ్గరి పడుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. దీంతో డైరక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ లో తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి తగిన విలన్ కోసం వెతికిన చిత్ర బృందం చివరికి బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ని ఎంపిక చేసింది. ఈయన మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమాలో విలన్ గా అలరించారు. తారక్ మూవీ అని చెప్పగానే నీల్ నితిన్ ఆలోచించకుండా ఒకే చెప్పినట్లు చిత్ర బృదం వెల్లడించింది.

భారీ బడ్జెట్ తో  కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు.  హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని కూడా టీమ్ లోకి ఆహ్వానించారు.  “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా, జెంటిల్ మాన్ భామ నివేత థామస్ నటించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు నింపుకుంటున్న ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus