తన భర్తతో కలిసి చీటింగ్ చేసిందట..!

  • March 6, 2020 / 04:42 PM IST

తన భర్తతో కలిసి నన్ను చీటింగ్ చేసిందంటూ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పై ఇటీవల కేసు ఫైల్ అవ్వడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తన భర్తతో కలిసి నన్ను మోసం చేసిందంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. 2014లో శిల్పాశెట్టి అలాగే ఆమె భర్త రాజ్ కుంద్రా ల ‘సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపనీ ఐదేళ్లకు సంబంధించి ఓ గోల్డ్ స్కీమ్ ని ప్రకటించింది. అందులో భాగంగా రూ.18 లక్షలు చెల్లించి సచిన్ జోషి అనే ఎన్నారై కిలో బంగారం కొనుగోలు చేశాడట. ఇందుకు గాను తనకొక గోల్డ్ కార్డ్ కూడా ఇచ్చారని తెలిపాడు.

ఇదిలా ఉంటే.. ‘ఐదేళ్లు గడిచినా.. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనకు బంగారం ఇవ్వలేదని’ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సచిన్ జోషి. అంతేకాక అతని టర్మ్ ప్లాన్ 2019 మార్చ్ 25న పూర్తయ్యిందట. గోల్డ్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు బంగారం తీసుకోవడానికి వారి ఆఫీస్ కి వెళ్తే.. ఆ కంపనీ మూసేశారని అతను చెప్పుకొచ్చాడు. ఈ విషయం పై శిల్పాశెట్టి అలాగే ఆమె భార్య రాజ్ కుంద్రాలను సంప్రదిస్తే.. వారిద్దరూ ఆ కంపనీకి రాజీనామా చేశామని చెప్పారట. ఈ రకంగా తను మోసపోయానని తెలుసుకున్న సచిన్ జోషి పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ విషయం పై ఇప్పటి వరకూ ఒక్క కంప్లైంట్ మాత్రమే వచ్చిందని.. కాబట్టి యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus