అభిమానులని కలవరపెడుతున్న కథానాయకుడు..!

  • December 31, 2018 / 01:39 PM IST

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం నుండీ మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , మరియు పాటలకి..మంచి స్పందన రావడంతో పాటు ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నందమూరి అభిమానులైతే ఎప్పుడెప్పుడా అని ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ చిత్ర విడుదలకి మరో 9 రోజులు మాత్రమే మిగిలుండడం.., ఇప్పటికీ ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.

ఈ విషయం పై నందమూరి అభిమానులు కలవరపడుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ చిత్ర సెన్సార్ పూర్తయ్యిందని, దీనికి ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు వారు జారీ చేసారని కొంతమంది చెప్తున్నప్పటికీ.. మరోవైపు రెండు భాగాలూ చూపిస్తేనే సెన్సార్ చేస్తామని ఓ అధికారి చెప్పినట్టు మరికొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ‘ఎన్టీఆర్ -మహానాయకుడు’ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఈ చిత్రంలో రానా, కళ్యాణ్ రామ్, సుమంత్, విద్యాబాలన్, నిత్యా మీనన్, హన్సిక, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus