శేఖర్ కమ్ముల సినిమాలో తెలంగాణ కుర్రాడిగా నాగచైతన్య

  • August 17, 2019 / 12:32 PM IST

“ఫిదా” సినిమాలో మలయాళ బ్యూటీ సాయిపల్లవిని తెలంగాణ అమ్మాయిగా చూపించి సూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల.. ఇప్పుడు నాగచైతన్యతో తాను తెరకెక్కించనున్న తాజా చిత్రంతోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఈ కొత్త సినిమాలో చైతూ తెలంగాణ కుర్రాడిగా.. తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపించనున్నాడట. స్వచ్చమైన తెలంగాణ నేర్చుకోవడం కోసం ఆల్రెడీ ఒక ట్యూటర్ ను పెట్టుకొని ట్రయినింగ్ మొదలెట్టాడట చైతూ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవ్వనుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇకపోతే.. “మజిలీ’తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న నాగచైతన్య ఆ సెక్సెస్ ను కొనసాగించాలని ప్లాన్ చేసుకొంటున్నాడు. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్ ఏదో అలా సాగుతూ వచ్చింది. కానీ.. “మజిలీ” కమర్షియల్ గానే కాక ఎమోషనల్ హిట్ కూడా సాధించి చైతూ కెరీర్ ను మలుపు తిప్పింది. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి.. ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు చైతూ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus