ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా రానున్న చిరంజీవి

  • February 28, 2017 / 06:51 AM IST

ఖైదీ నంబర్ 150 తరవాత మెగాస్టార్ చిరంజీవి చేయనున్న మూవీ ఖరారు అయిపోయింది. ఆ చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా… చిరు ఏటీఎం.. అదేనండీ హీరో శ్రీకాంత్ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు.  అన్నయ్య  తన 151వ సినిమాగా ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ”ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” కథను చేయనున్నాడని శ్రీకాంత్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారు. తెల్ల దొరలను ఎదురించి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆయన ఫ్యామిలీ గురించి ఓ టీవీ ఛానల్ వారు ప్రత్యేక కథనం ప్రసారం చేశారు.  శ్రీకాంత్ స్వయంగా ఉయ్యాలవాడ గ్రామానికి వెళ్లి.. అక్కడ ఉయ్యాలవాడ వారి కుటుంబాన్ని కలసి.. ఆ కథను అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు.

ఈ కథతో చిరంజీవి సినిమా చేస్తున్నారని చెప్పడంతో.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందపడ్డారని తెలిపారు. ఇలా ఈ విషయం బయటపడింది. 1840 లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టేందుకు మగధీర, బాహుబలి కి గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్  ని నిర్మాత రామ్ చరణ్  టీమ్ లోకి  తీసుకున్నారు. హిస్టారికల్ మూవీని స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి 8  నెలల్లో కంప్లీట్ చేసి 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ శ్రమిస్తున్నారు. ఇందులో చిరు సరసన శృతిహాసన్ నటించనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus