నాకౌట్ పంచ్ అదిరిపోవాలంటూ లైగర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరు!

  • August 25, 2022 / 09:53 AM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నటిస్తున్నటువంటి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, కరణ్, రమ్యకృష్ణ అననే పాండే ఛార్మి అందరికీ ఈయన ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.

మీలాగే ఇండస్ట్రీ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్ పంచ్ అదిరిపోవాలి అంటూ ఈయన చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ సినిమా రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తమ సినిమా విడుదల విషయంపై స్పందిస్తూ విష్ చేయడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా జరుపుకున్న ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే మాత్రం ఈ సినిమా గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది.ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కావడంతో అన్ని భాషలలోను పెద్ద ఎత్తున ఎమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ మాస్ పర్ఫామెన్స్ చేసినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus