Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu) స్టార్ట్ అయ్యి 2 వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పుడు గేమ్ కూడా రసవత్తరంగా మారినట్టు అనిపిస్తుంది. ఏదో ఒక టాస్క్ విషయంలో హౌస్మేట్స్ అంతా గొడవ పడి బిగ్ బాస్ ఇగోని సంతృప్తిపరిచేలా చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఫుడ్ ఐటమ్స్ కోసం ఓ టాస్క్ పెట్టి.. కొంతమంది హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు ఇన్ఫినిటీ మనీ గెలుచుకునే ఇంకో టాస్క్ పెట్టాడు. ఈ క్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి నిఖిల్, పృథ్వి మధ్య పోటీ నెలకొంది.

Bigg Boss 8 Telugu

వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. ఇక దీని గేమ్లో భాగంగా ఫస్ట్ బజర్ మోగేసరికి, విష్ణు ప్రియా, మణికంఠ, సోనియాలను స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నాడు బిగ్ బాస్.ఈ క్రమంలో పరిగెత్తుతూ సోనియా కింద పడిపోవడం జరిగింది. దీంతో విష్ణుప్రియ ముందుగా స్విమ్మింగ్ పూల్లో దూకడం జరిగింది. ఆ తర్వాత మణికంఠ దూకాడు. దీంతో ఫస్ట్ టాస్క్ లో విష్ణు ప్రియ గెలిచినట్టు అయ్యింది.దీని ద్వారా ఆమె 25 వేల ప్రైజ్ మనీ గెలుచుకుందట.

కింద పడ్డ సోనియాకు గాయలేమీ కాలేదు. అయినప్పటికీ ఆమె ఏడ్చేసింది. దీంతో నిఖిల్ మనం ఆరిస్టులం కాబట్టి ఫిజికల్ గా గాయాలు అయితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత యశ్మీ నిఖిల్ పై ఫైర్ అవ్వడం జరిగింది. తర్వాత నిఖిల్, పృథ్వీ…ల మధ్య ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu) . ఇందులో వాళ్ళు కుస్తీ పోటీని తలపించేలా పోటీపడినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఇన్ఫినిటీ మనీ అనేది హౌస్మేట్స్ మధ్య గొడవలు అయ్యేలా చేసింది అని చెప్పాలి.

’35- చిన్న కథ కాదు’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

https://youtu.be/MrbFO4j2ehU?si=_-RpHuLZ6EUtzm0H

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus