Swathi: సాయి ధరమ్ తేజ్ చదువులో అంత వీకా.. పరువు తీసిన స్వాతి!

  • September 27, 2023 / 06:45 PM IST

మెగా హీరో సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్సిడెంట్ తర్వాత ఈయన విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా సాయి ధరంతేజ్ మంత్ ఆఫ్ మధు సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నవీన్ చంద్ర కలర్స్ స్వాతి జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయి ధరంతేజ్ కలర్స్ స్వాతి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి బయటపెట్టారు.

కలర్స్ స్వాతి (Swathi) ధరమ్ తేజ్ ఇద్దరు కూడా డిగ్రీలో క్లాస్మేట్స్ అనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కలర్స్ స్వాతి మాట్లాడుతూ మా ఇద్దరి పేర్లు ఎస్ తోనే మొదలవడంతో పరీక్షలలో సాయి ధరంతేజ్ ఎప్పుడు నా వెనకే ఉండేవారు అయితే ఆయన ప్రతిసారి నా పేపర్లో చూసి పరీక్షలు రాసి పాసయ్యారని తెలియజేశారు.

ఇక సాయిధరమ్ తేజ్ కూడా మాట్లాడుతూ పరీక్షలలో చూపించమంటే నన్ను బాగా ఏడిపించేది, ప్రాక్టికల్ సమయంలో కూడా రిజల్ట్ చెప్పమన్నా చెప్పేదికాదు అంటూ ఈ సందర్భంగా వీరిద్దరూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో భయ్యా చదువులో మరి ఇంత వీకా నువ్వు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus