నిర్మాతలలో దిల్ రాజుకే పెద్ద దెబ్బ పడిందా..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నిర్మాత దిల్ రాజు. ఈ ఏడాది ఈయన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండకుండా చేసింది ‘జాను’ చిత్రం. ఆయన ఎంతో మోజు పడి రీమేక్ చేయించుకున్న ఈ చిత్రం ఈయన్ని పెద్ద దెబ్బె కొట్టింది.

పోనీలే ఆ నష్టాల్ని ‘వి’ చిత్రం తీరుస్తుంది అని ఆయిన ఎంతో ధీమాగా ఉన్న టైములో కరోనా మరో పెద్ద దెబ్బ కొట్టింది. ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడటమే కాదు… మొత్తం షూటింగ్ లే ఆగిపోయేలా చేసింది కరోనా. ‘వి’ చిత్రానికి దిల్ రాజు 40 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఇప్పుడు పవన్ తో చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ కూడా కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది.

Dil Raju Interview

ఈ చిత్రం సగభాగానికే 35 కోట్ల వరకూ దిల్ రాజు ఖర్చు చేసారట. వీటితో పాటు ఈయనకి నైజాం, ఉత్తరాంధ్రలో చాలా థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు షో లు రన్ అవ్వక పోయినా … మైంటైన్ చేసే వారికి జీతాలు ఇవ్వాల్సిందే. కాబట్టి నిర్మాతలతో దిల్ రాజు ఇప్పుడు చాలా నష్టాలలో ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus