గోపీచంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా..!

Ad not loaded.

ఈషా రెబ్బా.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 9ఏళ్ళు కావస్తున్నా.. ఇంకా ఓ పెద్ద ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. 2012 లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈషా రెబ్బా. అయితే అటు తరువాత వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతోనే కంప్లీట్ హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకోవడం అలాగే ఆ తరువాత చేసిన ‘అమీ తుమీ’ ‘అ!’ ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి సినిమాలు కూడా డీసెంట్ హిట్లుగా నిలవడంతో..

ఈమెకు మంచి క్రేజ్ దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈమె ఒక్క ‘అరవింద సమేత’ లో తప్ప.. మరో పెద్ద సినిమాలో నటించలేదు. ఇప్పటికీ ఈషాకు పెద్ద సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఈమె ‘పిట్ట కథలు’ అనే క్రేజీ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. త్వరలోనే ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. దీంతో పాటు అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో కూడా చిన్న పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా..

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా ఈషా అవకాశం దక్కించుకుందట. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా మారుతీ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా రాశీ ఖన్నా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా ఎంపికైనట్టు తాజా సమాచారం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus