విచారణకు హాజరైన దీపికా పదుకొనె

  • September 26, 2020 / 02:49 PM IST

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. రియా చక్రవర్తితో మొదలైన డ్రగ్స్ కేసు విచారణ మెల్లగా బాలీవుడ్ బిగ్స్ షాట్స్ వరకు పాకింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ లతో పాటు బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె సైతం డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్ అధికారుల విచారణలో పాల్గొన్నారు. అధికార్లులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

కాగా నేడు దీపికా పదుకొనె విచారణలో పాల్గొన్నారు. నేటి ఉదయం దీపికా ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. దీపికాతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఈ విచారణకు హాజరు కావడం జరిగింది. దీపికా పదుకొనె మరియు మేనేజర్ కరిష్మా ప్రకాష్ డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ కోణంలోనే దీపికా మరియు కరిష్మా ప్రకాష్ ని అధికారులు విచారించనున్నారు. అలాగే శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ కూడా ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కావాల్సివుంది.

ఇప్పటికే వారికి నోటీసులు అందినట్లు సమాచారం. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి రిమాండ్ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆమె జ్యూడీషియల్ రిమాండ్ లో ఉంది. ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రియా మరియు షోవిక్ బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న సెలెబ్రిటీల పేర్లు వెల్లడించారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus