సుకుమార్ కథతో హీరోగా మారుతున్న దేవిశ్రీప్రసాద్

  • April 23, 2019 / 06:26 PM IST

అప్పుడెప్పుడో “కుమారి 21ఎఫ్” ప్రమోషన్స్ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తాను అని సుకుమార్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సుకుమార్ దర్శకుడనీ, ఛార్మీ హీరోయిన్ అనీ రకరకాల రూమర్లు వచ్చాయి అప్పట్లో. అయితే.. ఆ సినిమా గురించి జనాలు కూడా మర్చిపోయారనుకొండి. కట్ చేస్తే.. ఇవాళ ఉన్నట్లుండి ఆ సినిమా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సుకుమార్ కథ అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ శిష్యుల్లో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుందట. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కించి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

సో, ఈ సినిమా మొదలైతే గనుక సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కొన్నాళ్లపాటు లీవ్ తీసుకోవడం ఖాయమన్నమాట. ఎలాగూ ఈమధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ సంగీతానికి ఇదివరకు వచ్చినంత రెస్పాన్స్ రావడం లేదు, అలాగే.. ఈమధ్యకాలంలో మనోడి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవలేదు. దాంతో దేవి శ్రీప్రసాద్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడంటే కొన్నాళ్లపాటు సంగీత దర్శకుడిగా గ్యాప్ తీసుకొన్నట్లేనన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus