హన్షిత రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వెనుక కారణం?

  • July 11, 2020 / 08:23 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరొందిన దిల్ రాజు గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా వెంటనే వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన రెండో పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇది పక్కన పెడితే.. తాజాగా దిల్ రాజు కూతురైన హన్షిత రెడ్డి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూలై 10న ఆమె తల్లి అనిత పుట్టినరోజు సందర్భంగా హన్షిత ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది.

ఈ క్రమంలో తన చిన్ననాటి ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హన్షిత రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. “అమ్మా.. నీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ జ్ఞాప‌కాలు ఎల్ల‌ప్పుడూ నాతోనే ఉంటాయి. వాటితోనే నేను జీవిస్తున్నాను. కొన్ని రోజులు నేను నీతో ఉన్నా.. ‌ ఎన్నో జ్ఞ‌ప‌కాలు, నీతో కలిసి దిగిన ఈ ఫొటోలో ఉన్నాయి. నీ చిరున‌వ్వుతో కూడిన చిత్రాలెన్నో నా మనసులో భద్రంగా ఉన్నాయి” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత.. 2017 లో అనారోగ్యం కారణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తరువాత తన తండ్రికి రెండో పెళ్లి చేసుకోమని సూచించింది హన్షిత రెడ్డి. అయినా దిల్ రాజు మాట వినకపోవడంతో ఎంతో పెద్దలతో.. పెళ్లి చేసుకోమని పట్టుబట్టేలా చేసింది. చివరికి దిగొచ్చిన దిల్ రాజు.. తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus