Dil Raju: అవార్డులపై దిల్ రాజు ఫోకస్!

  • February 22, 2023 / 03:53 PM IST

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. అందులో ‘శతమానం భవతి’ ఒకటి. ఈ సినిమా దిల్ రాజుకి భారీ కలెక్షన్స్ తో పాటు మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అందుకే ఆయన కెరీర్ లో ‘బొమ్మరిల్లు’ తరువాత ఇదొక స్పెషల్ ఫిలిం అని చెబుతుంటారు. ‘శతమానం భవతి’కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు మరో అవార్డు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కమెడియన్ వేణుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘బలగం’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఇండస్ట్రీకి చెందిన కొందరికి, అలానే తన స్నేహితులకు కొంతమందికి స్పెషల్ షోలు వేస్తూ.. వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు. తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్లీ తనకు నేషనల్ అవార్డు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారాయన. అదే విషయాన్ని తన సన్నిహితులతో కూడా చెబుతున్నట్లు సమాచారం.

ఒక వృద్ధుడి మరణం తరువాత జరిగే డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడలో వచ్చిన ‘తిథి’ అనే సినిమాకి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ‘తిథి’ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కన్నడ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పుడు ‘బలగం’ కూడా అదే కోవకి చెందిన సినిమా కావడంతో.. కచ్చితంగా ఈ సినిమాకి కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నారు దిల్ రాజు. ఒక్క నేషనల్ అవార్డు మాత్రమే కాకుండా..

‘బలగం’ తన బ్యానర్ కి మరిన్ని అవార్డులు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు దిల్ రాజు. మరి ఈ సినిమా దిల్ రాజు నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే.. దిల్ రాజు బ్యానర్ లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ సినిమా తెరకెక్కుతోంది. అలానే విజయ్ దేవరకొండ-పరశురామ్ సినిమా లైన్ లో ఉంది. ఇవి కాకుండా మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు దిల్ రాజు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus