Anil Ravipudi: క్షమాపణలు కోరిన అనిల్ రావిపూడి.. ఏమైందంటే..?

Advertisement

ఇటీవల సత్యదేవ్ (Satyadev) హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయిన కొరటాల శివ, (Koratala Siva) , రాజమౌళి (SS Rajamouli), అనిల్ రావిపూడి (Anil Ravipudi) , గోపీచంద్ మలినేని (Gopichand Malineni)  వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ అంతా వీరి వల్ల సరదా సరదాగా జరిగింది. అయితే అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తూ.. ‘ ఐపీఎల్ మ్యాచ్..ల వల్ల కొంపలేమి ములిగిపోవు. సినిమాలకి రండి. వచ్చి మధ్యలో స్కోర్ బోర్డు చూసుకోండి’ అంటూ కామెంట్స్ చేశాడు.

ఎన్నికల హడావిడి ఒక పక్క.. ఐపీఎల్ మ్యాచ్ ..లు ఇంకో పక్క ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అనేది వాస్తవం. కానీ అనిల్ రావిపూడి కామెంట్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పై నెగిటివ్ కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు అనిల్ రావిపూడి కామెంట్స్ ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు అయిన మల్లిడి వశిష్ట్ ను (Vassishta) కూడా హర్ట్ చేశాయట. స్వయంగా మల్లిడి వశిష్ట్ చెప్పిన మాట ఇది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడిని దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది గా వశిష్ట్ కోరాడు. దీంతో అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ‘నా కామెంట్స్ వల్ల నేను కూడా హర్ట్ అయ్యాను. ఆ ఈవెంట్ కి వచ్చే ముందు నేను ఓ డిస్ట్రిబ్యూటర్ ని కలిశాను. ఆయన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అని, మినిమమ్ బుకింగ్స్ కూడా ఉండటం లేదు అని నిరుత్సాహపడ్డాడు.

ఆ మూడ్ లో నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఇది మీరు ‘అఫెండ్’ అయ్యారని నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఐపీయల్ చూడండి.. టైం ఉంటే మా సినిమాలు కూడా చూడండి’ అంటూ అనిల్ రావిపూడి సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus