టాలీవుడ్లో మరో విషాదం..కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి..!

  • May 1, 2021 / 10:06 AM IST

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ మరింత ప్రమాద కరంగా మారుతుంది. గత కొద్దిరోజుల నుండీ 3 లక్షల పైనే కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు..అలాగే నైట్ కర్ఫ్యూ లు కూడా పెట్టారు. అయినప్పటికీ దీనిని కట్టడి చెయ్యడం సాద్యపడటం లేదు. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఇక కరోనా కారణంగా సినీ పరిశ్రమలో కూడా మరణాలు సంభవిస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం.

తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కరోనా కాటుకి బలైపోయాడు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కుమార్ పట్టి.. కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కరోనా భారిన పడి చికిత్స పొందుతూ వచ్చిన కుమార్.. శుక్రవారం నాడు ప్రాణాలు విడిచాడట. ఇతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీకాకుళం అని తెలుస్తుంది. సినిమా పై ఉన్న ప్యాషన్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

 

మొదట్లో పలు సినిమాలకు అసిస్టెంట్ గా, సహా రచయితగా ఇతను పనిచేశాడు. మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు పరశురామ్(బుజ్జి) దగ్గర ఇతను అసిస్టెంట్ గా పనిచేశాడు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus