మూడేళ్ళ తరువాత మారుతీ సినిమా విలువ తెలుసుకుంటున్నారు..!

  • March 20, 2020 / 07:26 PM IST

కరోనా ఎక్కడ ఉన్నా…ఎక్కడికి వెళ్తున్నా.. ఇదే పదం వింటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి అతలాకుతలం చేసేస్తోంది. ప్రస్తుతం ఈ మహమ్మారి వల్ల టాలీవుడ్ సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. సినిమాలే కాదు సీరియల్ షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. సినీ సెలబ్రిటీలు అంతా.. ఇప్పుడు కరోనా నుండీ మనల్ని మనం సంరక్షించుకోవడం ఎలా అంటూ.. శుభ్రంగా ఉండడమే ప్రధాన అంశం అంటూ వీడియోలు చేసి విడుదల చేస్తున్నారు. అయితే మన నెటిజన్లు మాత్రం మారుతీ డైరెక్షన్లో వచ్చిన ‘మహానుభావుడు’ చిత్రంలోని సీన్లని తీసుకుని హైలెట్ చేస్తుండడం విశేషం.

మూడేళ్ళ క్రితం అంటే.. 2017 దసరాకి విడుదలైన ఈ చిత్రం ఓసిడి తో బాధపడే హీరో సమస్యల ఆధారంగా రూపొందింది. తాను పాటించే అతి శుభ్రత వల్ల తన.. తల్లికి ఎలా దూరమయ్యాడు అలాగే తను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనే నేపథ్యంలో … ఆద్యంతం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయితే అప్పటి కంటే.. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఈ చిత్రం మరింత పాపులర్ అవుతుంది. దర్శకుడు మారుతీతో పాటు హీరో శర్వానంద్ పేర్లు కూడా ఇప్పుడు ఇండియన్ లెవెల్లో మారుమోగిపోతున్నాయి. ఇక ఈ విషయం పై దర్శకుడు మారుతీ స్పందిస్తూ .. “మహానుభావుడు’ సినిమా గురించి ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు… మెసేజ్ లు చేస్తున్నారు. సినిమా వచ్చిన టైమ్ లో అతిశుభ్రం అంటే మరీ ఇంత దారుణంగా ఉంటారా? అంటూ కామెంట్స్ కామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు.. ఇదేం విడ్డూరం అంటూ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నాకూ కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ కామెడీ కాబట్టి వల్ల వర్కౌట్ అయిపొయింది. సినిమా తీస్తున్నప్పుడు నేను కూడా అలానే శుభ్రం.. పరిశుభ్రం అంటూ ప్రవర్తించాను. అయితే ఇప్పుడు అందరూ నేను సినిమాలో చూపించినట్టే పాటిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ `మహానుభావుడు`గా మారిపోతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలిసి ఉంటే.. ఆ సినిమాని ఇంకా బాగా తీసేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus