ట్రోలింగ్ దెబ్బకి అకౌంట్ తీసేసిన దర్శకుడు!

  • November 18, 2022 / 04:41 PM IST

ఇటీవల కోలీవుడ్ లో విడుదలైన ‘లవ్ టుడే’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గానే తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రదీప్..

ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రదీప్ దర్శకుడు కాకముందు తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ లో కొన్ని పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు వాటిని తవ్వి తీసి.. స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లలో ప్రదీప్ ముఖ్యంగా సచిన్, ధోనీ లాంటి లెజండరీ క్రికెటర్స్ ను తిట్టారు. సచిన్ ఇండియన్ క్రికెట్ లోనే అత్యంత స్వార్ధపరుడైన ఆటగాడని.. ధోనీ బంతులను విపరీతంగా వేస్ట్ చేస్తాడని..

జిడ్డు బ్యాటింగ్ తో సతాయిస్తాడని ఇలా చాలా కామెంట్స్ చేశారు. దీంతో నెటిజన్లు ప్రదీప్ పై మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రదీప్ స్పందించారు. తన పాత పోస్ట్ లు కొన్నింటిని మార్ఫ్ చేసి ట్రోల్ చేస్తున్నారని.. అందుకే తన ఫేస్ బుక్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పారు. వైరల్ అవుతున్న కొన్ని పోస్ట్ లు నిజమైనవని..

అయితే తనకు సరైన మెచ్యూరిటీ లేనప్పుడు ఆ పోస్ట్ లు పెట్టానని.. ఎవరైనా సరే వయసుతో పాటు తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారని.. తాను కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ దర్శకుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేస్తాడని అంటున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus