రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ‘నఘం’ టీజర్ విడుదల

  • May 18, 2022 / 12:10 PM IST

గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘నఘం’. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భగవత్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు.

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అరవింద్ కెమెరాపనితనం, భగవత్ సంగీతం అద్భుతంగా కుదిరాయి. టీజర్ చూస్తుంటే టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తోంది. విజువల్స్ అదిరిపోయాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఉండాల్సిన మూడ్‌ను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ద్వారా తీసుకొచ్చారు.

టీజర్‌తో నఘం సినిమా మీద అంచనాలు పెరిగాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్లు అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus