టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) ‘తొలిప్రేమ’ సినిమాతో క్యూట్ డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత సార్, లక్కీ భాస్కర్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
సిల్వర్ స్క్రీన్పై ఇలా తనదైన మార్క్ చూపిస్తున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్పై కూడా తన మ్యాజిక్ రిపీట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు.
అతడు ఓ భారీ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. వెంకీ అట్లూరి తన డిజిటల్ డెబ్యూ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో చేతులు కలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, నెట్ఫ్లిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ను నిర్మించబోతున్నాయట. సిల్వర్ స్క్రీన్పై ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే ఈ డైరెక్టర్.. తన తొలి వెబ్ సిరీస్ కోసం ఒక అదిరిపోయే స్టోరీలైన్ రెడీ చేశాడట.
ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నటించే స్టార్ కాస్ట్, ఇతర టెక్నీషియన్ల వివరాలపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.నిజానికి వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయాల్సి ఉంది. కానీ, నాని ప్రస్తుతం తన పాత కమిట్మెంట్స్, ఇతర ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఆ సినిమాలన్నీ పూర్తయి, వెంకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. అందుకే, ఈ గ్యాప్ను వృథా చేయకుండా.. తన దగ్గర రెడీగా ఉన్న వెబ్సిరీస్ స్క్రిప్ట్ను పట్టాలెక్కించాలని వెంకీ డిసైడ్ అయ్యాడట. నాని ఫ్రీ అయ్యేలోపు ఈ డిజిటల్ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనేది అతడి ప్లాన్గా కనిపిస్తోంది. ప్రస్తుతం వెంకీ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.