కాంట్రవర్సీలు ఎందుకని పాటను ఆపేసిన చిత్రబృందం!

  • October 24, 2019 / 04:25 PM IST

ఈమధ్యకాలంలో సినిమాల టైటిల్స్ లేదా సినిమాల కథాంశాలు కొందరి మనోభావాలు దెబ్బతినడం కారణంగా విడుదల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. “వాల్మీకి/గద్దలకొండ గణేష్, సైరా” విడుదల సమయంలో ఆ గోల చూశాం. ఇప్పుడు ఆ గోల మహేష్ బాబుకి కూడా తప్పలేదని తెలుస్తోంది. మహేష్ బాబు సరికొత్త చిత్రం “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం తమన్నాతో ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశారు చిత్రబృందం. “బందరు మిఠాయి.. బోర్డరు సిపాయి” అనే పల్లవితో సాగే పాటను బోర్డర్ నేపధ్యంలో చిత్రీకరించాలని కూడా ఫిక్స్ అయ్యారు. అయితే.. సోషల్ మీడియాలో ఆ సాహిత్యం గురించి జరుగుతున్న రచ్చ చిత్రబృందం దాకా వచ్చాయంట.

అందుకే.. ఆ పాట సాహిత్యం మార్చాలని ఫిక్స్ అయ్యి.. అప్పటివరకూ సాంగ్ ను హోల్డ్ లో పెట్టారంట. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇకపోతే.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, తమన్నా స్పెషల్ సాంగ్స్ లో మెరవనుండగా, విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. అనిల్ రావిపూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus