బాలీవుడ్ ని భయపెడుతోన్న సినిమా!

  • March 13, 2021 / 01:02 PM IST

టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. లాక్ డౌన్ అనంతరం జనాలు సినిమాలు చూడడానికి థియేటర్లకు వస్తున్నారు. దీంతో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది.

టాలీవుడ్ కంటే ముందుగానే బాలీవుడ్ లో థియేటర్లు తెరిచారు. కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావడం లేదు. ఏ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావట్లేదు. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ‘ఇందూ కీ జవానీ’, ‘మేడం చీఫ్ మినిష్టర్’ లాంటి సినిమాలకు అసలు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రీసెంట్ గా జాన్వీ కపూర్ నటించిన హారర్ కామెడీ సినిమా ‘రూహి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ పరిస్థితి మారుతుందనుకుంటే అది కూడా జరగడం లేదు. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. మొదటిరోజే సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది.

కనీసం సినిమా ఎలా ఉందో చూడడానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ.3 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. షేర్ చూసుకుంటే కోటిన్నర కంటే తక్కువ. డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాతో నష్టాలు తప్పేలా లేవు. సినిమాకి దారుణమైన టాక్ రావడంతో వీకెండ్ లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ‘రూహి’ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయితే.. సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాను విడుదల చేయడానికి భయపడుతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus