మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడా..?

  • March 15, 2021 / 03:35 PM IST

‘విన్నర్’ సినిమా డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు గోపీచంద్ మలినేని. రవితేజని హీరోగా పెట్టి ‘క్రాక్’ అనే మాస్ స్టోరీతో సినిమా తీశాడు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు గోపీచంద్ మలినేనిపై పడింది. మెగాస్టార్ చిరంజీవి కూడా మలినేనిని ఇంటికి పిలిపించి మరి శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అగ్ర నిర్మాతలు ఈ డైరెక్టర్ తో సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని.. బాలకృష్ణని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే గోపీచంద్ కి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాతో గనుక సూపర్ హిట్ అందుకుంటే తన తదుపరి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దించుతామని గోపీచంద్ మలినేనికి ఆఫర్ ఇచ్చిందట మైత్రి సంస్థ.

మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే గనుక గోపీచంద్ మలినేని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోవడం ఖాయం. ఇలాంటి బంపర్ ఆఫర్ ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు మలినేని. దీనికోసం బాలయ్య సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. మహేష్ బాబుకి మైత్రి సంస్థతో మంచి బంధం ఉంది. గతంలో వీరితో కలిసి ‘శ్రీమంతుడు’ అనే సినిమాకి పని చేశాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాను నిర్మిస్తుంది కూడా మైత్రి సంస్థే. ఈ నమ్మకంతోనే గోపీచంద్ మలినేనికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus