‘సరైనోడు’ కధను కాదన్న హీరో!!!

  • March 12, 2016 / 09:08 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మాస్ మసాలా సినిమా సరైనోడు. ఈ చిత్రం ఇప్పటికీ పాటలు మినహా దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దం అవుతున్న సంధర్భంలో ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ కధను ఒక డైనమిక్ హీరో మిస్ చేసుకున్నాడు అని తెలుస్తుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే గోపీచంద్ అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్త. లెజెండ్ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనుతో  బోయపాటి ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు. అయితే ముహూర్తం షాట్ తరువాత ఆ సినిమా ప్యాక్ అప్ చెప్పెయ్యడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఆ తరువాత మంచి మాస్ కధ తీసుకుని వెళ్ళి గోపీచంద్ కు చెప్పిన బోయపాటికి గోపీచంద్ దగ్గర చుక్కెదురు కావడంతో ఆ కధ బన్నీ వాకిట్లో వాలింది. మొదటినుంచి కధల విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే బన్నీ ఈ కధను వినగానే ఒకే చేసేసాడు. ఇంకెముందీ డైనమిక్ సినిమా ఒకటి రెడీ కి రంగం సిద్దం అయ్యింది. అదే బన్నీ హీరోగా….”సరైనోడు” టైటిల్ తో ప్రజల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బన్నీకి ఎంతటి ఘన విజయాన్ని ఇస్తుందో….చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus