ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్

  • April 22, 2020 / 06:30 PM IST

గత కొంతకాలం నుండీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంలో హీరో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను గోపీచంద్ ఖండించాడు. ‘అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలీదని ఆయన చెప్పుకొచ్చాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ టైమ్‌లో ఇలాంటి రూమర్లు అన్నీ వినాల్సి వస్తుంది. రజినీ కాంత్ గారి సినిమాలో నటించడం లేదు. నాకు తెలిసి ఇలాంటి రూమర్‌ రావడం వెనుక ఒకే ఒక కారణం ఉంది.

రజనీ కాంత్ గారి ‘అన్నాత్తే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ నాకు మంచి స్నేహితుడు. గతంలో మేమిద్దరం కలిసి ‘శౌర్యం’, ‘శంఖం’ వంటి చిత్రాలు చేశాం. అందుకే ఇలాంటి రూమర్ వచ్చి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో మేల్ కబడ్డీ టీంకు గోపీచంద్ … అలాగే ఫిమేల్ కబడ్డీ టీం కు తమన్నా కోచ్ లుగా కనిపించనున్నారు.

‘హిప్పీ’ భామ దిగంగన సూర్య వంశీ కూడా ఈ చిత్రంలో ఓ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనుంది. వెన్నెల కిశోర్ కామెడీ అయితే ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. గతంలో గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమ్ నంద’ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి..!

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus