మహేష్, వంశీ సినిమాకి పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే

  • July 7, 2018 / 02:04 PM IST

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఈ మూవీ షూటింగ్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరుగుతోంది. ఈరోజుతో తొలి షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలిసింది. రేపటి సాయంత్రం లోపున చిత్ర యూనిట్ హైదరాబాద్ కి రానుంది. ఇందులో మహేష్ బాబు కి అల్లరి నరేష్ ప్రాణస్నేహితుడిగా కనిపించబోతున్నారు. మహేష్ కోటీశ్వరుడిగా, నరేష్ పేదవాడిగా నటించనున్నారు. దిల్ రాజు, అశ్విన్ దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ అమెరికాలో త్వరలో మొదలు కానుంది.

డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేర్లు ఇవేనంటూ రెండు పేర్లు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. “రాజసం”, “రైతుబిడ్డ” అనే టైటిల్స్ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాలకు హీరో మహేష్ పరిష్కారమార్గాన్ని చూపించనున్నట్లు సమాచారం. అందుకే ఆ పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో మహేష్ అభిమానులు ఎందుకు ఓకే అంటే ఆ టైటిల్ కే మహేష్ ఓకే చెప్పనున్నట్లు టాక్. మరి ఏది ఫైనల్ అవుతుందో.. త్వరలోనే తెలియనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus