Ajith, Chiranjeevi: విశ్వంభర సెట్స్ కి అజిత్.. ఫోటోలు వైరల్!

  • May 29, 2024 / 04:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) ..లు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల కలయిక ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో అజిత్ ఓ సినిమా చేస్తున్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్..లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతుంది. దీంతో గ్యాప్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టేస్తున్నాడు అజిత్. ఇదే క్రమంలో పక్క సెట్స్ లో జరుగుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ కి వెళ్లి ఆ టీంని కూడా సర్ప్రైజ్ చేసినట్టు మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. “మా ‘విశ్వంభర’ సెట్స్ కి సర్ప్రైజింగ్ స్టార్ గా అజిత్ విచ్చేశారు. అతని సినిమా(గుడ్ బ్యాడ్ అగ్లీ) షూటింగ్ కూడా ఇదే స్టూడియోలో జరుగుతుంది. దీంతో కాసేపు మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో అజిత్ ‘ప్రేమ పుస్తకం’ అనుభవాలు పంచుకున్నాం.ఆ సినిమా ఆడియో లాంచ్ వేడుక నా చేతుల మీదుగా జరిగింది.

అలాగే నా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాలో అజిత్ భార్య షాలిని (Shalini) కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాంటి గొప్ప మెమోరీస్ కూడా మేము గుర్తు చేసుకోవడం జరిగింది.కాలక్రమేణా అజిత్ ఇంత పెద్ద స్టార్ అవ్వడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. అతని మంచి మనసు వల్లే అతను ఈరోజు ఇలా ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus