Hero Nani: కొడుకుతో కలసి శబరిమలలో సందడి చేసిన హీరో నాని!

  • November 22, 2022 / 11:58 AM IST

సాధారణంగా హీరోలు కూడా ప్రతి ఏడాది కొందరు స్వామి వారి మాలలు ధరించి దీక్ష తీసుకోవడం మనం చూస్తున్నాము. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు స్వామివారి మాలలు ధరిస్తూ ఉంటారు. అయితే తాజాగా నాచురల్ స్టార్ నాని సైతం అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన మాల ధరించి ఇరుముడితో శబరిమల స్వామి వారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నటువంటి నాని ఈ యాత్రకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ క్రమంలోనే నాని స్వామివారి ఇరుముడి తీసుకొని కాలినడకన వెళ్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇక తన కుమారుడు అర్జున్ తో కలిసి శబరిమలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ శబరిమల యాత్రకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా కాలినడకన ఇరుముడితో స్వామివారి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా బంగారు పద్దెనిమిది మెట్ల వద్ద తన కుమారుడితో కలిసి దీపాలను వెలిగించి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

ఈ వీడియోని షేర్ చేస్తే శబరిమల యాత్ర ఎంతో అనుభూతిని కలిగించిందని ఈ అనుభూతి కోసం మరో సంవత్సరం పాటు వేచి చూడాలని ఈయన చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియోకి స్వామి శరణం అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం నాని షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే నాని సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus