‘మహేష్ 27’ హీరోయిన్ ఈమేనా..?

  • June 17, 2020 / 08:00 AM IST

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ఇప్పుడు పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ మధ్యనే విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్న విషయాన్ని మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు.

మొదట కీర్తి సురేష్ అన్నారు.. ఆ తరువాత కియారా అద్వానీ అన్నారు. అటుతరువాత వాళ్ళు కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కోసం గాలిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ‘దబాంగ్3’ చిత్రంలో నటించిన సాయి మంజ్రేకర్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఈ విషయం పై తాజాగా క్లారిటీ ఇచ్చింది సాయి మంజ్రేకర్.. “మహేష్ సర్ మూవీ గురించి నాతో ఎవ్వరూ సంప్రదింపులు జరుపలేదు. ఆ విషయం గురించి నాకు ఏమీ తెలీదు.

అయితే నా తల్లిదండ్రులకు నమ్రత చాలా క్లోజ్. అందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయేమో” అంటూ చెప్పుకొచ్చింది. మహేష్ ప్రతీ సినిమా క్యాస్టింగ్ అండ్ ప్రమోషన్స్ విషయంలో నమ్రత కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ‘భరత్ అనే నేను’ చిత్రం కోసం కియారాను టాలీవుడ్ కు తీసుకొచ్చింది నమ్రతనే అని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈసారి కూడా ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం సాయి మంజ్రేకర్ ను తీసుకురాబోతుందేమో అని టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus