డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన హీరోయిన్స్ కి బెయిల్ నిరాకరణ

  • September 29, 2020 / 10:31 AM IST

బాలీవుడ్ తరువాత శాండిల్ వుడ్ లో ఆ స్థాయిలో డ్రగ్స్ రచ్చ జరుగుతుంది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంచారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఈ ఇద్దరు బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. సంజనా గల్రాని, రాగిణి ద్వివేది లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్ట్ తిరస్కరించడం జరిగింది.

దీనితో మరికొంత కాలం వీరిద్దరూ జైలుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెండితెరతో మొదలైన ఈ డ్రగ్స్ చైన్ బుల్లితెరకు కూడా వ్యాపించింది. కన్నడ బుల్లితెర యాంకర్స్ అనుశ్రీ, అకుల్ బాలాజీలను అధికారులు విచారించడం జరిగింది. నటుడు కిషోర్ శెట్టి, అతని మిత్రులు తరుణ్ లను అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. వీరికి యాంకర్ అనుశ్రీ స్నేహితురాలు కావడం విశేషం. కిషోర్ శెట్టి తరచుగా ప్రైవేట్ పార్టీలు నిర్వహించే వాడట.

ఈ పార్టీలలో విరివిగా డ్రగ్స్ వాడేవారని సమాచారం. ఈ పార్టీలకు అనుశ్రీ కూడా హాజరైనట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి అనుశ్రీకి కూడా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉండే అవకాశం కలదని అధికారులు భావిస్తున్నారు. కాగా సంజన గల్రాని ఈ దందా ద్వారా కోట్లు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus