కేరళ లోను జనతా గ్యారేజ్ క్రేజ్

  • August 22, 2016 / 09:47 AM IST

హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ కోసం కేరళ సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తారక్ గత సినిమాలు అక్కడ బాగానే బిజినెస్ చేసింది. దీంతో అక్కడ ఎన్టీఆర్ కి అభిమానులు ఏర్పడ్డారు. అంతేకాకుండా ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండడంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 2 న వారికి ఓనం పండుగ మొదలు కానుంది.

దాదాపు రెండు వారాల పాటు కేరళీయులు ఈ వేడుక రాష్ట్రము మొత్తం జరుపుకుంటారు. సెలవు దినాల్లో ఈ మూవీ విడుదలవుతుండటంతో థియేటర్లు కిటకిటలాడే అవకాశం ఉందని కేరళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని వదులుకోకూడదనిచిత్ర బృందం అక్కడ కూడా భారీ ప్రచారం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన జనతా గ్యారేజ్ ఆడియో(మలయాళం)ని ఈ నెల 26 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకకి చిత్ర యూనిట్ అందరు హాజరు కానున్నారు. కేరళ మీడియాకు ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో తారక్ క్రేజ్ చూస్తుంటే కలక్షన్ల్ విభాగంలో జనతా గ్యారేజ్ రికార్డులు సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus