జై లవకుశకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ !
- June 14, 2017 / 07:49 AM ISTByFilmy Focus
యంగ్ ఎన్టీఆర్…నందమూరి హీరోల్లో ఒకడిగా, టాప్ హీరోల్లో ఇంకొకడిగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే అసలు కారణ ఏంటి ఎన్టీఆర్ హాట్ టాపిక్ ఎందుకు అయ్యాడు అంటే…ఒకసారి ఈ కధ చదవండి, యంగ్ టైగర్ ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే ఆ తరువాత వరుస హిట్స్ తో దుమ్ము దులపడమే కాకుండా జనతా గ్యారేజ్ సినిమాతో దాదాపుగా 85కోట్ల కలెక్షన్స్ ను సాధించి తన కరియర్ లోనే టాప్ మరియు బిగ్గెస్ట్ హిట్ గా తన సినిమాని నిలిపాడు. అయితే అదలా ఉంటే అసలు మ్యాటర్ ఏంటి అంటే జనతా గ్యారేజ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా బాబి చెప్పిన జై లవకుశ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే క్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా బిజినెస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది అని తెలుస్తుంది.
జనతా గ్యారేజ్ కలక్షన్స్ 85 కోట్లు రాగా ఇప్పుడు జై లవకుశ ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లు చేస్తుండటం విశేషం. అసలు అంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కు కారణాలు లేకపోలేదు….ఆ విషయల్లోకి వెళితే, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ ఉండడం, అదే క్రమంలో సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తుండటం ఫస్ట్ లుక్ లో తారక్ నెగటివ్ లుక్ తో సంచలనం సృష్టించడం వెరసి మొత్తంగా ఈ సినిమా బిజినెస్ పీక్స్ కు వెళ్లేలా చేసేశాయి. ఇక అదే క్రమంలో ఈ సినిమా బిజినెస్ ఏరియాల వారిగా చూస్తే నైజాం 28 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్ల దాకా జరుగుతుంది. అంటే కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 85 కోట్ల బిజినెస్ చేసిన జై లవకుశ వరల్డ్ వైడ్ ఇంకెంత రికార్డ్ రేటుకి పరుగెడుతుందో చూడాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రకంగా ఎన్టీఆర్ సినిమా రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం విశేషం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












