మహానటి చిత్రం కోసం వంద డ్రస్సుల్లో కనిపించనున్న కీర్తి సురేష్!

  • November 30, 2017 / 07:06 AM IST

తెలుగువారు గర్వించే నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో తన రోల్ గురించి వివరించారు. “సావిత్రిగారిలా నటించడం నిజంగా సాహసమేననే విషయం అర్ధమైంది. ’10 సెకన్లలో 100 రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల ప్రతిభావంతురాలు సావిత్రి గారు. ఆమెలా హావభావాలను ప్రదర్శించడం చాలా కష్టంగా అనిపించింది” అని వెల్లడించారు.

ఇంకా మాట్లాడుతూ “వయసును బట్టి సావిత్రి మారుతూ వచ్చింది.. నేను అలాగే కనిపించాల్సి వచ్చింది. ఈ విషయంలోను ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు.” అని చెప్పారు. “ఈ సినిమాలో నేను 100 రకాల కాస్ట్యూమ్స్ తో కనిపించనున్నాను. ఇది వరకు నేను ఇన్ని డ్రస్సులు ఏ చిత్రంలో ధరించలేదు.ఈ సినిమా ప్రత్యేకతల్లో ఇది ఒకటి.” అని కీర్తి అన్నారు.  దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, షాలిని పాండే, డైరక్టర్ క్రిష్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ కోసం కోలీవుడ్, టాలీవుడ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus