పెళ్ళికంటే ముందు దత్తత – మనీషా కొయిరాలా

  • September 12, 2016 / 10:57 AM IST

బొంబాయి, భారతీయుడు వంటి చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా. క్యాన్సర్ మహమ్మారిని జయించి మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోన్న మనీషా పెళ్లి చేసుకోవాలనుకుంటోందట. ఇదివరకే ఆమెకు తన దేశానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్తని వివాహం చేసుకున్న మనీషా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న మనీషా దానికంటే ముందు ఎవరినైనా దత్తత తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

నేపాల్ వదిలి ముంబైలో సెటిల్ అయినా మనీషా ఒంటరితనంతో బాధపడుతున్నారట. దాంతో వచ్చే ఏడాదిలోపు దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అలాగే మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే తనతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారట. గతేడాది ‘ఒరు మెల్లియ కుడు’  అనే ద్విభాషా (తమిళం, కన్నడ) చిత్రంలో నటించిన మనీషా ప్రస్తుతం ‘డియర్ మాయ’ సినిమాలో నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus