Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

లేక లేక తెలుగులో రెండు సినిమాలు చేస్తే.. రెండింటి విషయంలోనూ ఇబ్బందులే ఎదుర్కొంది జాన్వీ కపూర్‌. ‘అసలెందుకు ఆ పాత్రలు చేశావ్‌ జాన్వీ’ అంటూ ఆమె అభిమానులు. తొలి సినిమా స్కిన్‌ షో మోతాదు ఎక్కువవగా, రెండో సినిమాలో భాష, చిత్రణ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమాలు చేయడానికి ముందకొస్తుందా అనే డౌటనుమానం అందరిలోనూ మొదలైంది. దాంతోపాటు మరికొన్ని డిస్కషన్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Janhvi Kapoor

అదే.. జాన్వీ కపూర్‌ తమిళ సినిమా పరిశ్రమ ఎంట్రీ. అయితే అది సినిమా కాదు అని కూడా అంటున్నారు. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ రూపొందించనున్న ఓ వెబ్‌ సిరీస్‌లో జాన్వీ కపూర్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదిస్తే నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వెబ్‌ సిరీస్‌కి సర్కునం దర్శకత్వం వహిస్తారట. ఇటీవలే ఆయన అబ్బాస్, దుషారా విజయన్, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో ‘ఎగ్జామ్‌’ సిరీస్‌ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

గ్రామీణ ప్రేమ కథలతో సినిమాను ఆవిష్కరించే సర్కునం.. ఇప్పుడు పాన్‌ ఇండియా లెవల్‌ కథతో ఓ వెబ్‌ సిరీస్‌కి సిద్ధమవుతున్నారట. అందుకే జాన్వీ కపూర్‌ని ప్రధాన పాత్ర కోసం సంప్రదించారట. మామూలుగా అయితే ఇలాంటి ప్రేమకథలు, ప్రయోగాలకు జాన్వీ ఓకే అంటుంది. బాలీవుడ్‌లో ఇలాంటి ప్రాజెక్టులు చేయడంలో జాన్వీ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. మరిప్పుడు ఆ తరహాలోనే ఈ తమిళ ప్రాజెక్ట్‌ చేస్తుందేమో చూడాలి. ఒకవేళ జరిగితే ఆమె తన నటనతో అదరగొట్టేస్తుంది అని చెప్పొచ్చు.

పనిలో పనిగా ఆమెలోని నటిని టాలీవుడ్ స్టార్‌, యువ దర్శకులు వాడుకోలేకపోయారు.. కేవలం గ్లామర్‌ ఎలిమెంట్‌గా మాత్రమే చూశారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ‘దేవర’లో తంగమ్‌గా కొరటాల శివ చూపించగా.. ‘పెద్ది’లో ఇంచుమించు అలానే అచ్చియమ్మగా బుచ్చిబాబు చూపించారు.

ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus