ఎన్టీఆర్ తో సినిమా చేయడా..?

  • December 22, 2020 / 05:47 PM IST

దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్2’ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి అప్పట్లో ఓ ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. కానీ ప్రాజెక్ట్ ముందుకు మాత్రం కదల్లేదు. ఊహించని విధంగా ప్రభాస్ సినిమాను లైన్ లోకి తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో కలిసి ‘సలార్’ అనే సినిమాను ప్రకటించాడు.

వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. 2021 లోనే రిలీజ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా సంగతేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభాస్ సినిమా ముందుగా చేస్తున్నాడు కాబట్టి తారక్ తో సినిమా క్యాన్సిల్ అయిందని అనుకోవడానికి లేదు. కానీ ఆ సినిమా ఉంటుందనే సంకేతాలు కూడా రావడం లేదు. ‘సలార్’ అనౌన్స్మెంట్ వచ్చిన తరువాత తమ హీరోతో సినిమా ఉంటుందో లేదోనని టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరడించే ప్రయత్నం కూడా ఏమీ జరగలేదు.

పోనీ ‘సలార్’ తరువాత అయినా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా..? అనే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నుండి కూడా క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కొందరు ప్రశాంత్ నీల్ ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నిస్తుంటే అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందో లేదోనని తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus