‘జాంబీరెడ్డి’ సీక్వెల్‌ తీస్తే.. సమంత పక్కా?

  • February 4, 2021 / 04:05 PM IST

తెలుగు సినిమాల్లో కొత్త జోనర్‌ వస్తే ఆదరిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ తరహాలో చాలా సినిమాలొచ్చాయి… అలరించాయి. ఇప్పుడు మరో కొత్త జోనర్‌ ఎంటర్‌ అవ్వబోతోంది. అదే జాంబీ జోనర్‌. ఇంగ్లిష్‌లో ఇప్పటికే ఈ జోనర్‌ సినిమాలు వచ్చి విజయం సాధించాయి. తొలిసారిగా తెలుగులో ‘జాంబీరెడ్డి’ రూపంలో రాబోతోంది. మరి సినిమా ఏమవుతుందనే ఆలోచన చాలా మందిలో ఉంది. సమంత కూడా ఇదే అనుకుందేమో ‘జాంబీ రెడ్డి’లో చేయడానికి అంగీకరించలేదు. అయితే సీక్వెల్‌ చేస్తే అందులో నటించడానికి ఓకే అందని తెలుస్తోంది.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దక్షిణాదిలో మొదటిసారి జాంబీ కాన్సెప్ట్‌ ను తీసుకు వచ్చాడు ప్రశాంత్‌ వర్మ. కరోనా వైరస్‌తోపాటు జాంబీల కాన్సెప్ట్‌ను కలగలిపి ఈ సినిమా రూపొందించారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో సమంత కనిపిస్తున్న నేపథ్యంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో సీక్వెల్‌ ఉంటుందని, అందులో సమంత నటిస్తోందని వినిపిస్తోంది.

‘జాంబీ రెడ్డి’కి ముందు ప్రశాంత్‌ వర్మ ఒక కథతో సమంతను సంప్రదించాడట. ఆ కథ కూడా జాంబీల నేపథ్యంలోనే ఉంటుందని తెలిసింది. కానీ జాంబీల కథతో చేసేందుకు సామ్‌ కాస్త భయపడిందట. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి’ సక్సెస్ అయితే తప్పకుండా ప్రశాంత్‌ వర్మ డైరక్షన్‌లో చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాంబీ కాన్సెప్ట్‌ తో సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ‘జాంబీ రెడ్డి’తో క్లారిటీ వస్తుంది. దాంతో ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ ను చేయాలా వద్దా అనే నిర్ణయానికి సమంత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే సమంతకు తొలుత చెప్పిన కథ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెలా కాదా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus