Guppedanta Manasu July 21st: రిషి విషయంలో తెలిసి కంగారు పడుతున్న జగతి మహేంద్ర!

  • July 21, 2023 / 11:34 AM IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…రిషి ని చంపడం కోసం శైలేంద్ర ఒక రౌడీని విశ్వనాథం ఇంట్లోకి పంపిస్తారు. అయితే రిషి ఫోన్ చూస్తూ కూర్చుండగా వెనకనుంచి ఓ వ్యక్తి తనని చంపడానికి రావడంతో వసుధార తనని కాపాడుతుంది.అనంతరం రీషి తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆ రౌడీ పారిపోతాడు. ఇక ఈ విషయం విశ్వనాథం గారికి చెప్పొద్దు అతను కంగారు పడతాడని చెప్పి రిషి తన గదిలోకి వెళ్ళిపోతాడు.

అనంతరం వసుధార కూడా వెళ్లి శైలేంద్రకు మేము ఇక్కడున్న విషయం తెలిసిందా అని అనుమాన పడుతూ…మహేంద్రకు ఫోన్ చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికైనా చెప్పారా అని అడగడంతో మహేంద్ర లేదని చెబుతారు. మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకండి అని వసుధార చెప్పడంతో అసలు ఏం జరిగిందని మహేంద్ర అడుగుతారు దాంతో వసుధార రిషి సార్ పై మరోసారి హత్య ప్రయత్నం జరిగింది అందుకే మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా చెప్పారా అని అడిగానని చెప్పడంతో మహేంద్ర షాక్ అవుతారు.అలాగే రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తారు అంటూ వసుధార హామీ ఇస్తుంది.

ఇలా మహేంద్రతో మాట్లాడి ఫోన్ పెట్టేయడంతో వెనుకనే ఉన్నటువంటి రిషి అసలు ఏం చేస్తున్నారు మేడం మీరు. ఇక్కడ జరిగినదంతా వాళ్లకు చెప్పి మరీ వారిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతారు. అలాగే నాకు నచ్చని పని గురించి నా నిర్ణయాలు కూడా మీరు తీసుకొని నన్ను ఒప్పించే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వెళ్ళబోతుండగా వసుధార ఆపుతుంది.అనంతరం మీరిద్దరి మధ్య గతంలో జరిగిన విషయం గురించి గొడవపడతారు.

నన్ను ఒక మోసగాడు అని ముద్ర వేశారు అని రిషి చెప్పడంతో వసుధార కూడా బాధపడుతూ మిమ్మల్ని కాపాడటం కోసమే అలా చేసాము మీరు అపార్థం చేసుకుంటారు అనుకోలేదు అర్థం చేసుకుంటారని అనుకున్నాను ఇప్పటికైనా మీరు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చెబుతుంది. మరోవైపు శైలేంద్ర దేవయానికి ఫోన్ చేసి రిషి తప్పించుకున్నాడని చెప్పడంతో ఆ రిషి ఉన్నంతవరకు నీకు ఎండి సీటు దక్కదు ఎలాగైనా వాడిని చంపే తిరిగిరా అని దేవయాని కూడా తన కొడుకుకు చెబుతుంది. అంతలోపు వెనక తన భర్త ఎవరు ఫోన్ అని అడగడంతో అంత వినేసారేమోనని కంగారుపడుతుంది.

కాకపోతే ఫణీంద్ర వినకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. శైలేంద్ర మరో రెండు రోజులు రానని చెబుతున్నాడు అని మాట మారుస్తుంది. మరోవైపు జగతి రావడంతో మహేంద్ర జరిగినది మొత్తం చెబుతాడు రిషి పై మరోసారి అటాక్ జరిగిందని చెప్పగానే జగతి షాక్ అవుతుంది. అలాగే ఇప్పుడు తన కొడుకు ఎలా ఉంది అంటూ కంగారుపడుతుంది. అనంతరం రిషి క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటుంది.రిషి ఎక్కడున్నాడని శైలేంద్ర తెలుసుకున్నాడా అందుకే ఇలా జరిగిందా అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పటికే శైలేంద్ర అక్కడికి వచ్చి పిన్ని బాబాయ్ అని పిలుస్తారు. దీంతో ఒక్కసారిగా మహేంద్ర జగతి షాక్ అవుతారు. ఇంతటితో (Guppedanta Manasu) ఈ ఎపిసోడ్ పూర్తిగా అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus