జనతా గ్యారేజ్ సెన్సార్ కి డేట్ ఫిక్స్!

  • August 22, 2016 / 12:08 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ పై “పక్కా లోకల్” పాట చిత్రీకరణతో జనతా గ్యారేజ్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  కార్యక్రమాలను జరుపుకుంటోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ లో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై క్రేజ్ ని పెంచింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు తారక్ అభిమానులకు బాగా నచ్చాయి. బంద్ ఉన్నా జనతా గ్యారేజ్ ని సెప్టెంబర్ 2 న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. పోస్ట్ పోన్ ఆలోచన లేకుండా తెలుగు, మలయాళం భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. అందుకే ఆగస్టు 26 న సెన్సార్ కు జనతా గ్యారేజ్ సినిమాను పంపించనున్నారు. ఆ దిశగా కొరటాల బృందం శ్రమిస్తోంది. సెన్సార్ అయినా వెంటనే సినిమా నటీ నటీనటులు ప్రచార కార్యక్రమాల్లో బిజీ కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus