రేపటితో షూటింగ్ పూర్తి చేసుకోనున్న జనతా గ్యారేజ్

  • August 19, 2016 / 10:52 AM IST

హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ షూటింగ్ రేపటితో పూర్తి కానుంది. కొన్ని రోజుల క్రితం టాకీ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీకి ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉండింది. ఆ పాటను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో వేసిన డాబా సెట్లో మూడు రోజులుగా తెరకెక్కిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆల్బమ్ లో మాస్ ను ఆకట్టుకుంటున్న”నేను లోకల్” ఐటమ్ సాంగ్ షూటింగ్ లో కాజల్,  తారక్ తో పాటు బ్రహ్మాజీ, బెనర్జీ తదితరులు పాల్గొంటున్నారు. ఈ పాట చిత్రీకరణలో ఎన్టీఆర్ స్పీడ్ ని అందుకోలేక కాజల్ ఇబ్బంది పడుతోందని చిత్ర బృందం వెల్లడించింది. రేపటితో సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలిపింది. సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 2 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus