Janhvi Kapoor: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్!

  • April 9, 2021 / 04:30 PM IST

లాక్ డౌన్ అనంతరం సెలబ్రిటీలంతా ట్రిప్ అనే పేరుతో మాల్దీవులకు చెక్కేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీనటులకు మాల్దీవులు ఫేవరెట్ ప్లేస్ గా మారింది. ప్రతీ వారం ఎవరో ఒక సెలబ్రిటీ మాల్దీవులకు వెళ్లడం, అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేయడం కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు, నటి జాన్వీ కపూర్ మాల్డీవులకు వెళ్లింది. నిజానికి మొన్నటివరకు జాన్వీ కపూర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చిల్ అయి ఇండియాకు వచ్చింది.

ఇక్కడికి రాగానే మళ్లీ మాల్దీవుల ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ తన స్నేహితులతో కలిసి బీచుల్లో షికారు చేస్తోంది. బికినీ వేసుకొని ఓ ఫోటోషూట్ లో కూడా పాల్గొంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారులో కిరాక్ పుట్టించింది. ఇప్పటివరకు జాన్వీ షేర్ చేసిన ఏ ఫోటోలో కూడా ఈ రేంజ్ లో అందాలు ఆరబోయలేదు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు జాన్వీకి కాంప్లిమెంట్స్ ఇస్తూ మెసేజ్ లు చేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ‘ధఢక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ‘రూహీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’ లో నటిస్తోంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తఖ్త్’, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

13

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus