క్వారంటైన్ లో ఉన్నాను… అసలు నిజం తెలిపిన శ్రద్దా..!

  • April 4, 2020 / 05:17 PM IST

ఇప్పుడు కరోనా ప్రపంచం మొత్తం భయపెడుతుంది. దీంతో ఇండియా వైడ్ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది అల్లరి నెటిజన్లు … కొంతమంది సెలబ్రిటీలకు కరోనా సోకింది అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలే చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు కాబట్టి .. ఇలాంటి ఫేక్ వార్తలను కూడా నమ్మేసి వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ కు కూడా కరోనా సోకింది అంటూ ప్రచారం జరిగింది.

ఇది కాస్త వైరల్ గా మారి ఆమె వరకూ వెళ్ళడంతో ఒక్కసారిగా షాక్ అయ్యిందట. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ…”నేను క్వారెంటైన్‌లో ఉన్న మాట నిజమే కానీ నాకు కరోనా సోకలేదు.ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసాను కాబట్టి.. ముందు జాగ్రత్తగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాను.

మార్చి 12 నుంచి 15 తేదీల మధ్య హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశాను.. కానీ ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేసిన వారెవ్వరికీ కరోనా సోకలేదు. సరే… రిస్క్ ఎందుకులే అని మా ఫ్యామిలీ డాక్టర్‌ సలహా మేరకు నేను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అది కూడా మార్చ్ 29తో పూర్తయ్యింది. ఇప్పుడు హాయిగా అమ్మకు వంట పనుల్లో సాయం చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది శ్రద్దా శ్రీనాథ్.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus