Jr NTR: కరోనా వల్ల మాట నిలబెట్టుకోని ఎన్టీఆర్!

  • August 27, 2021 / 06:41 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులు ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ తో పాటు విజ్ఞానం కూడా లభిస్తూ ఉండటంతో ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం రోజున ప్రసారమైన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ అనురాధ పాల్గొని ఏకంగా 12 లక్షల 50వేల రూపాయలు గెలుచుకున్నారు. ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే ఈ ఎపిసోడ్ లో అనురాధకు డ్యాన్స్ చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. 12,50,000 రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెబితే డ్యాన్స్ చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ కరోనా ప్రోటోకాల్స్ వల్ల డ్యాన్స్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ అభిమానితో డ్యాన్స్ చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానిని మోసం చేశారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కరోనా నిబంధనల వల్ల ఎన్టీఆర్ చెక్ ను సైతం కంటెస్టెంట్లకు నేరుగా ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పేరుతో ఉన్న టాటూను చూపించి అనురాధ యంగ్ టైగర్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. జీవితంలో తాను ఎన్టీఆర్ కే థ్యాంక్స్ చెప్పుకుంటానని అనురాధ చెప్పడంతో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తనపై ప్రేమను పెంచుకున్న అభిమానులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెబుతూ యంగ్ టైగర్ అనురాధకు వీడ్కోలు చెప్పారు. ఎన్టీఆర్ హోస్ట్ గా బాగా చేస్తున్నారని ఇతర హీరోల అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus