Jr NTR Family: తిరుమలలో మెరిసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 16, 2022 / 05:07 PM IST

ఇటీవల ఎన్టీఆర్‌ ఫ్యామిలీ తిరుమలలో మెరిసింది. తిరుమల శ్రీవారిని ఎన్టీఆర్ కుటుంబం దర్శించుకోవడం అటు తర్వాత మీడియా కంటికి చిక్కడం జరిగింది. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ లు శ్రీవారి సేవలో పాల్గొనడం జరిగింది. అటు తర్వాత ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch Now

అయితే ఎన్టీఆర్ మాత్రం తిరుమల వెళ్ళలేదు.’ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రమోషన్స్‌లో ఆయన ఫుల్ బిజీగా ఉండడమే అందుకు కారణం అని తెలుస్తుంది.అయితే ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ కొడుకులు హైలెట్ గా నిలిచారు అని చెప్పొచ్చు. అభయ్ రామ్, భార్గవ్ రామ్.. ఇద్దరూ కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఫొటోలకి ఫోజులు ఇచ్చిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. భార్గవ్ రామ్ ను కనుక చూస్తే అచ్చం ఎన్టీఆర్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

పెద్దబ్బాయి అభయ్ రామ్ అయితే చూడ్డానికి వాళ్ళ అమ్మ లక్ష్మీ ప్రణతిలానే కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కు కాస్త గ్యాప్ దొరికితే.. భార్యా పిల్లల్ని వెంటేసుకుని విదేశాలకి హాలిడే ట్రిప్ కు వెళ్తుంటాడు. ఫ్యామిలీ విషయంలో ఎన్టీఆర్ చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ ను తెర పై చూసి దాదాపు 4 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఆర్.ఆర్.ఆర్ థియేటర్ల వద్ద ఆయన అభిమానులు ఆల్రెడీ సందడి మొదలుపెట్టేసారు. ఒక్కొక్కరు 4 రోజులకి సరిపడేలా టికెట్లు బుక్ చేసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus